GVK రూ. 705 కోట్లు దారిమళ్లించినట్లు చెబుతూన్నCBI

న్యూఢిల్లీ : జీవీకే గ్రూపనకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) షాకిచ్చింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) నిధుల నుంచి రూ.705 కోట్లను దారిమళ్లించారన్న ఆరోపణలపై ఆ గ్రూప్ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ఎంఐఏఎల్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డితో పాటు ఎంఐఏఎల్, జీవీకే గ్రూపునకు చెందిన జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, మరో 9 ప్రైవేట్ కంపెనీలపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ముంబై, హైదరాబాద్ లోని జీవీకే గ్రూప్ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగినట్లు సీబీఐ అధికారులు దికారులు వెల్లడించారు.



జీవీకే ఎయిర్ పోర్ట్ ఇంగ్స్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇతర పెట్టుబడిదారులు కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్టప్ (పీపీపీ) కింద జాయింట్ వెంచర్ లో ఎంఐఏఎల్ ను నడుపుతున్నాయి. ఎంఐఏఎల్ రాబడులను తక్కువగా, వ్యయాన్ని ఎక్కువగా చూపుతూ రికార్డులను తారుమారుచేసి భారీగా నిధులను దారిమళ్లించారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు వివరించారు. ముంబై విమానాశ్రయ ఆధునీకరణ, నిర్వహణ కోసం ఏఏఐ గల 2006 ఏప్రిల్ 4న ఎంఐఏఎల్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఎంఐఏఎల్ hు ఎగ్జిక్యూటివ్లతోపాటు గుర్తుతెలియని తెలియని కొందరు ఏఏఐ అధికారులతో కలిసి జీవీకే గ్రూప్ ప్రమోటర్లు వివిధ మార్గాల్లో నిధులను దారిమళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయని సీబీఐ అధికారులు తెలిపారు. వచ్చాయని సీబీఐ అధికారులు తెలిపారు. 2017-18లో జీవీకే గ్రూప్ ప్రమోటరు బోగన్ వర్క్ కాంట్రాకులతో 9 కంపెనీలకు నిధులు మళ్లించారని, దీంతో ఎంఐఏఎల్‌కు రూ.310 కోట్ల నష్టం పాటల్లందున వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది.


మరోవైపు జివికె గ్రూపు కంపెనిలకు - నిధులను సమకూర్చేందుకు ఎంఐఎఎలకు ఎంఐఏఎల్‌కు చెందిన రూ.395 కోట్ల రిజర్వు నిధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నది. అంతేకాకుండా జీవీకే గ్రూపు తమ ప్రధాన కార్యాలయ, గ్రూపు 50 ఎనల ఉరు గ్రూపు కంపెనీల ఉద్యోగులకు చెల్లింపుల పేరిట వ్యయ లెక్కలను ఎక్కువగా చూపి ఎంఐఏఎలకు రూ.100 కోట్ల నష్టాన్ని ఆ కలిగి నిర్వహణతో ఈ ఉద్యోగులెవరికీ సంబంధం లేదని సీబీఐ వివరించింది. దీనితో కూడా కలిపితే ఎంఐఏఎలకు వాటిల్లిన నష్టం రూ.805 కోట్లకు చేరుతుందని, కానీ ఈ రూ.100 కోట్లను ఎస్ఎఆర్‌లో పొందుపర్చలేదని అధికారులు చెప్పారు. ఈ కుంభకోణం వల్ల ఎంఐఏఎలకు వాటిల్లిన నష్టం.. మున్ముందు జరిగే దర్యాప్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అడ్డగోలు కాంట్రాక్టులతో జీవీకే గ్రూప్ ప్రమోటర్లు ఎంఐఏఎల్ రాబడులను తక్కువగా చూపారని, అంతేకాకుండా తమ వ్యక్తిగత, కుటుంబ ఖర్చుల కోసం ఎంఐఏఎల్ నిధులను ఉ వయోగించుకొన్నారని నీబీఐ ఆరోపించింది.