చైనా ఉత్పత్తులపై వేటు

చైనా ఉత్పత్తులపై వేటు



ముంబై : చైనాతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న 500లకుపైగా వస్తూత్పత్తులను అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) బహిష్కరించింది. ఇందులో ఎస్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆట వస్తువులు, ఫర్నీషింగ్ ఫ్యాబ్రిక్స్, టెక్స్ టైల్స్, బిల్డర్ హార్వేర్, పాదరకలు, దుస్తులు, వంట a సామాగ్రి తదితర ఉత్పత్తులున్నాయి. 'వచ్చే ఏడాది ఆఖరుకల్లా చైనా నుంచి లో భారత్ కు దిగుమతి అవుతున్న వనువులను దాదాపు వస్తువులను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర తగ్గించుకోవడమే మా లక్ష్యం' అని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఓ ప్రముఖ జాతీయ వాణిజ్య దినపత్రికతో అన్నారు. అలాగే ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్డీఎస్ ప్రాజెక్టు , రద్దు చేసి చైనా కంపెనీకి బదులు భారత ఉం కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని తోసి. కోరినట్లు చెప్పారు. పేటీ ఎం, బిగ్ బాస్కెట్ తదితర భారతీయ స్టార్టప్లో 3: చైనా పెట్టుబడులపై ఓ కన్నేయాలని కూడా కోరామన్నారు. హెచ్ డీఎఫ్సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇటీవల పెట్టిన పెట్టుబడులనూ ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు ఖండేల్వాల్ తెలిపారు. ఈ పెట్టుబడులను అడ్డుకోవాలన్నారు.


చైనా నుంచి భారత్ లోకి కుప్పలు తెప్పలుగా రకరకాల వస్తూత్పత్తులు వచ్చిపడుతున్నాయి. అయితే వీటిలో కొన్నింటికి భారత్ లో ప్రత్యామ్నాయ వస్తువులుండగా, మరికొన్నింటికి చైనావే దిక్కు. ఈ క్రమంలో 3 వేల వస్తువుల దిగుమతులను ఆపవచ్చని, భారతీయ వస్తువులు వీటికి ప్రత్యామ్నాయంగా ఉ న్నాయని ఖండేల్వాల్ వెల్లడించారు. సదరు వస్తువులు భారత్ లోనూ లభిస్తున్నాయని, కాబట్టి ఆయా ఉ త్పత్తులను చైనా నుంచి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 40 వేల వర్తక సంఘాలు, 7 కోట్ల వర్తకులకు సీఏఐటీ ప్రాతినిథ్యం వహిస్తున్నది. భారతీయ వాణిజ్య లోటులో 40 40 శాతానికి పైగా చైనాతోనే ఉన్నదిగతేడాది చైనా నుంచి భారత్ దిగుమతులు 50 బిలియన్ డాలర్లు పెరిగితే.. ఆ దేశానికి భారతీయ ఎగుమతులు మాత్రం 2.5 బిలియన్ డాలర్లే పెరిగాయి.


చైనా ఉత్పత్తులకు మద్దతుగా ప్రచారం చేయవద్దని సినీ ప్రముఖులకు నీఏఐటీ విజ్ఞప్తి చేసింది. 'చైనాతో పోరాటానికి సరిహద్దులదాకా వెళ్లాలని మేము మీకు చెప్పడం లేదు. చైనా వస్తూత్పత్తులను బహిష్కరించి సైన్యం మాతృభూమికి అండగా ఉండాలని కోరుతున్నాం' అని ఖండేల్వాల్ అన్నారుమహారాష్ట్ర ప్రభుత్వం మూడు చైనా సంస్థలతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకున్నది. వివిధ దేశాలకు చెందిన 12 కంపెనీలతో మహారాష్ట్ర రూ.16 వేల కోట్ల విలువైన ఎంవోయూలను చేసుకోగా, అందులో చైనాకు చెందిన 3 కంపెనీలతో రూ.5 వేల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలూ ఉన్నాయి. సోమవారం ఈ ఒప్పందాలు కుదిరాయి. హెండ్లో ఇంజినీరింగ్ ఫోటాన్-వీఎంఐ ఎలక్టో మొబిలిటి సొల్యూషన్స్ జాయింట్ వెంచర్, గ్రేట్ వాల్ మోటర్స్ సంస్థలు పుణెలోని తాలేగాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ, 20 మంది భారత సైనికులు అమరులైన నేపథ్యంలో ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. చైనా ఉత్పత్తుల బహిష్కరణను భారతీయ ఆటో రంగ దిగ్గజాలు మారుతి సుజుకీ, బజాజ్ వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వాహన ఉ త్పత్తికి చైనా విడిభాగాలు చాలా అవసరమని ఈ సంస్థలు వాదిస్తున్నాయి. చైనా నుంచి సదరు ఉ త్పత్తుల రాక నిలిచిపోతే.. ఆ ప్రభావం వాహన వినియోగదారులపై పడుతుందని అంటున్నాయి. వాహన తయారీదారుల కంటే ఆటో విడిభాగాల అమ్మకందారులే ఎక్కువగా ప్రభావితులవుతారని మారుతి సుజుకీ ఓ జాతీయ వార్తా చానెల్ లో వ్యాఖ్యానించింది.