ప్రజా సాక్షిజగిత్యాల బ్యూరో(జూన్ 20): జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో శుక్రవారం నాడు ఉదయం కొందరు స్థానికులు చిరుత పులి సంచరిస్తుందని ఆందోళనకు గురై జిల్లా అటవీ శాఖ అధికార్లకు సమాచారం అందించారు.
దీనితో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తన సిబ్బందితో చిరుత పులి అనవాళ్లను గుర్తించేందుకు అనుమానిత ప్రాంతంలో గాలించారు. అటవీ శాఖ అధికారుల గాలింపుతో ఆప్రాంత ప్రజలు కోదీ సేపు హైరానా చెందారు.
అయితే ఘటన సలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దాని అడుగులు చూసి చిరుత కాదని, అటవీ వీలి అడుగులుగా నిరారించారు. పట్టణంలోని వాణి నగర్ రామాలయం ధర్మశాల పరిసరాలకు అనుకుని ఉన్న మోటర్ గ్యారేజ్, ఇళ్ల మధ్య ఉదయం స్థానికులు చిరుత పులి ఆకారం ను గుర్తించి ఆందోళన చెందారు. దీనితోనే కొందరు యువకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా అనుమానిత పరిసర ప్రాంతాలకు చేరుకొని దాని అడుగులను పరిశీలించిన జిల్లా అటవీ శాఖ అధికారి చిరుతపులి అడుగులు కావని, అటవీ జాతికి చెందిన అటవీ పిల్లిగా గుర్తించారు. దాని వల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది మనుషులకు ఎలాంటి ప్రాణాపాయం కలగచేయదని, త్వరలోనే అది ఎక్కడ ఉన్నా గుర్తించి పట్టుకుంటామని ప్రజలకు అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.