వ్యాక్సిన్ రేసులో హైద్రాబాద్
కాంగ్రెస్ హైద్రాబాద్, జూన్ 22 మానవాళిని ఆందోళనకు గురి చేస్తోన్న కరోనా వైరస్ నిర్మూలనకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబయికి చెందిన గ్లెన్మార్క్ అనే ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో మందు బిళ్లలు తయారు చేసినట్లుగా శనివారమే ప్రకటించింది. అయితే, తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ ఔషధం పని చేస్తుందని పేర్కొంది. తాజాగా హైదరాబాదు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కరోనాను కట్టడిచేసే రెట్లిసివిర్ ఔషధాన్ని ఆవిష్కరించింది. 'కోవిఫర్' ఇంజెక్షన్ పేరుతో దీన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ మేరకు కరోనా మహమ్మారిపై పోరాటంలో హెటిరో కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్ మెడిసిన్ (రె)సివిర్) ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాము అనుమతి పొందినట్లు వెల్లడించింది. కరోనా కోసం తాము తయారు చేసిన ఔషధం 'కోవిఫర్' అనే పేరుతో భారతదేశంలో మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఇంజెక్షన్లను లక్ష డోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని హెటిరో సంస్థ వెల్లడించింది. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి మాట్లాడుతూ.. 'దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో తాము తయారు చేసిన 'కోవిఫర్' ఔషధం విజయవంతంగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రానుంది. ప్రస్తుత అవసరాలకు తగినట్లు త్పత్తులు అందించేందుకు సిద్ధమవుతున్నాం. వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య సిబ్బందితో మేం నిరంతరం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా న్నాం.” అని ప్రకటించారు. కోవిఫర్ ఇంజక్షన్ మందు 100 మిల్లీ గ్రాముల చొప్పున ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించాలని సంస్థ వెల్లడించింది.